Author Archive: Om Prakash

స్వర్ణశోభిత ‘ఆనందనిలయ విమాన వేదిక’పై  శ్రీవారు, దేవేరుల కల్యాణ వైభోగం 

తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో స్వర్ణశోభితమైన ఆనందనిలయ విమానం తరహాలో రూపొందించిన వేదికపై శ్రీ పద్మావతి పరిణయోత్సవం గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సాక్షాత్తు విమాన వేంకటేశ్వరస్వామివారు సాక్షాత్కరించారా అన్నట్టు వేదికను సర్వాంగసుందరంగా అలంకరించారు. సాయంత్రం వేళ అస్తమించే సూర్యుని కిరణాలు బంగారు రంగులో ప్రసరించడంతో వేదిక ప్రాంగణం మరింత శోభాయమానంగా మెరిసిపోయింది. ఈ సందర్భంగా టిటిడి…
Read more

ఈ-హుండీ ద్వారా శ్రీవారికి టిటిడి ఈవో రూ.ఒక లక్ష కానుక

టిటిడి కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు గురువారం ఈ-హుండీ ద్వారా శ్రీవారికి ఒక లక్ష రూపాయలు కానుకగా సమర్పించారు. ఆన్‌లైన్‌ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ-హుండీ, ఈ-డొనేషన్‌ తదితర ఆన్‌లైన్‌ అప్లికేషన్లకు ఈవో శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

మే 5న ఆన్‌లైన్‌లో 54,421 ఆర్జిత సేవా టికెట్లు విడుదల

జులై, ఆగస్టు నెలల్లో భక్తులు బుక్‌ చేసుకునేందుకు గాను మొత్తం 54,421 శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను మే 5వ తేదీన టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జులై నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల వివరాలు : సుప్రభాతం – 1550, అష్టదళపాదపద్మారాధన – 120, నిజపాద దర్శనం – 800. ఆగస్టు నెలకు…
Read more

కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న టిటిడి ఈవో

టిటిడి కార్యనిర్వహణాధికారి డా|| డి.సాంబశివరావు తన సతీమణి శ్రీమతి జ్యోతిష్మతితో కలిసి బుధవారం కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. తలనీలాలు సమర్పించి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నారు. ఆ తరువాత శ్రీవారిని దర్శించుకున్నారు. 2014, డిసెంబరు 17న టిటిడి 24వ ఈవోగా డా|| డి.సాంబశివరావు బాధ్యతలు…
Read more

Exit mobile version